ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు భారత సీనియర్ బౌలర ఇషాంత్ శర్మ. ఓ సారి మాత్రం ధోని కోపాన్ని చూశానని పేర్కొన్నాడు. గ్రౌండ్లో తరచుగా దుర్భాషలాడేవాడని ఇషాంత్ హాట్ కామెంట్స్ చేశాడు.
భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనిని అందరూ ‘మిస్టర్ కూల్’అంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఉండటం.. మ్యాచ్ ఆరంభం నుంచి చివరివరకూ ప్రశాంతత కోల్పోకపోవడం అతడి సొంతం. కీలక ఐసీసీ టోర్నీలలో కూడా ధోని తన వ్యూహాలతో పాటు ఈ కూల్నెస్ తో కూడా ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేశాడు. ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ను సైతం తన మాయాజాలంతో భారత్ ఖాతాలో పడేలా చేసిన సందర్భాలెన్నో. అలా ఐసీసీ నిర్వహించే అన్ని ట్రోఫీలను అందుకున్న ఏకైక కెప్టెన్గా మహీ చరిత్ర సృష్టించాడు. ఆయనకు భారత్తో పాటు ప్రపంచంలోని అన్ని దేశాల్లో కోట్లాది మంది అభిమానులున్నారు.
అలాంటి ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు భారత సీనియర్ బౌలర ఇషాంత్ శర్మ. అసలు ధోని కెప్టెన్ కూల్ కాదని.. గ్రౌండ్లో తరచుగా దుర్భాషలాడేవాడని హాట్ కామెంట్స్ చేశాడు. మహీ భాయ్కి వున్న బలాల్లో కూల్ అంట్ కామ్ ఒకటే కాదని.. జాతీయ జట్టుకు ఆడుతున్నా, ఐపీఎల్లోనైనా ధోనీ చుట్టూ ఎవరో ఒకరు వుంటాని ఇషాంత్ చెప్పాడు. మహీ చుట్టూ ఊరి వాతావరణం వుంటుందని, చెట్లు మాత్రమే వుండవన్నాడు.
ALso Read: ధోని కాదు.. టీమిండియాలో అసలైన ‘మిస్టర్ కూల్’ కెప్టెన్ అతడే.. సన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఓ మ్యాచ్లో తాను బౌలింగ్ కోటాను పూర్తి చేసుకున్నాక.. ధోని నా దగ్గర వచ్చి అలిసిపోయావా అని ప్రశ్నించాడు. దీనికి నేను ఔను అన్నట్లుగా సమాధానమిచ్చానని.. దానికి మహీ నీకు వయసు పెరుగుతోంది, రిటైర్ అయిపో అన్నాడని శర్మ గుర్తుచేసుకున్నాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయినా.. ఆయన ఎప్పుడూ తనపై కోప్పడిన సందర్భాలు లేవన్నాడు. అయితే ఓ సారి మాత్రం ధోని కోపాన్ని చూశానని పేర్కొన్నాడు. మహీ భాయ్ వేసిన త్రోను తాను సరిగా అందుకోలేదని.. దీంతో ఆయన గుడ్లురిమి చూశాడని, రెండోసారి ఇంకా బలంగా త్రో విసిరాడని .. దానిని అందుకోలేకపోయానని ఇషాంత్ శర్మ చెప్పాడు. మూడోసారి మాత్రం సీరియస్ లుక్ ఇచ్చాడని.. చేతిని బాల్తో కొట్టుకోమ్మన్నట్లుగా సైగలు చేశాడని ఆయన చెప్పుకొచ్చాడు.