అందాన్ని ఎరగా వేసి వ్యాపారం., డబ్బు విషయంలో గొడవ.. చివరకు..

By telugu news teamFirst Published Jun 6, 2020, 10:30 AM IST
Highlights

దివ్య అనే యువతి అందాన్ని అడ్డుపెట్టుకుని ఆమెతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించాలని వివాహిత వసంత, ఆమె సోదరి ప్లాన్ వేసుకున్నారు. దివ్యను పెట్టుబడిగా పెట్టి వసంత గ్యాంగ్ డబ్బులు సంపాదిస్తోంది. 

విశాఖ నగరంలో ఇటీవల దివ్య అనే యువతి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అతి దారుణంగా హత్య చేశారు. కాగా.. సదరు యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. దివ్య అందాన్ని ఎరగా వేసి వ్యాపారం చేసుకోవాలని ఓ మహిళ భావించింది. అందుకు దివ్య అంగీకరించలేదనే కారణంతోనే హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

గ్రేటర్ విశాఖ నగరంలో రెండు రోజుల క్రితం అక్కయ్యపాలెం చెక్కులురాయి బిల్డింగ్‌ వద్ద అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన దివ్య కేసులో వెలుగుచూసిన విషయాలు ఇలా ఉన్నాయి. దివ్య అనే యువతి అందాన్ని అడ్డుపెట్టుకుని ఆమెతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించాలని వివాహిత వసంత, ఆమె సోదరి ప్లాన్ వేసుకున్నారు. దివ్యను పెట్టుబడిగా పెట్టి వసంత గ్యాంగ్ డబ్బులు సంపాదిస్తోంది. ఇలా జరుగుతున్న క్రమంలో డబ్బులు పంపకం విషయంలో దివ్య, వసంత గ్యాంగ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. 

దీంతో దివ్యను అంతమొందించాలని వసంత గ్యాంగ్ స్కెచ్ వేసింది. అంతే తడువుగా కుట్ర ప్లాన్‌ను అమలు చేశారు. దివ్యకు గుండు గీసి, కనుబొమ్మలు కత్తిరించి, వాతలు పెట్టి ప్రాణాలు తీశారు. మూడు రోజులు భోజనం పెట్టకుండా గదిలో చిత్రహింసలు పెట్టి చంపినట్టు విచారణలో వెల్లడైంది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. రెండో రోజుల్లోనే మిస్టరీని ఛేదించారు. దివ్య స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాగా గుర్తించారు. నిందితులు వసంత, ఆమె సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరు కోసం గాలింపు చేపట్టారు.

యువతి దివ్యను గాయపరిచిన, హత్యకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న సామగ్రిని, పరికరాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులను, చుట్టుపక్కల ప్రాంతాల వారి నుంచి వివరాలను పోలీసులు సేకరించారు.

click me!