ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన కత్తి దాడి వెనుక ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడి హస్తం ఉందని ఆరోపించారు మంత్రి నక్కా ఆనంద్బాబు.
ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన కత్తి దాడి వెనుక ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడి హస్తం ఉందని ఆరోపించారు మంత్రి నక్కా ఆనంద్బాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడి కత్తిని బొత్స మేనల్లుడు చిన శ్రీను విమానాశ్రయానికి తీసుకెళ్లారని.. ఆధారాలు దొరక్కుండా మాయం చేశారని మంత్రి ఆరోపించారు.
దాడి ఘటన జరిగి ఐదు రోజులు కావొస్తున్నా జగన్ ఇంతవరకు స్పందించకపోవడం అనుమానాలను కలిగిస్తోందన్నారు. ఇకనైనా ప్రతిపక్షనేత నోరు విప్పాలని.. స్థానిక పోలీసులకు సహకరించాలని ఆనంద్బాబు సూచించారు. ఏపీలోని వ్యవస్థలకు నమ్మకం లేదంటున్నారు..
అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో పోటీ చేసే అర్హత కూడా లేదని మంత్రి వ్యాఖ్యానించారు. దాడి విషయంలో బీజేపీ చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని.. జగన్ విచారణకు సహకరించకుంటే.. అరెస్ట్ చేసైనా విచారణ జరపాలని ఆనంద్బాబు డిమాండ్ చేశారు.
దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్
చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్
నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స
టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా
జగన్పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
జగన్పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు
దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..
జగన్పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే విచారణ
జగన్పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు
జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్లో: వైజాగ్ సీపీ
జగన్పై దాడి: కిచెన్లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్గా ఎందుకు
జగన్పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట