జగన్‌పై వెయిటర్ దాడి: ట్విస్టిచ్చిన చంద్రబాబు

By narsimha lodeFirst Published Oct 25, 2018, 6:48 PM IST
Highlights

విశాఖలో దాడి జరిగిన వెంటనే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హైద్రాబాద్‌   (పక్క రాష్ట్రం) వెళ్లిపోయారని....పక్క రాష్ట్రానికి వెళ్లి ఎలా విచారణ జరపాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.


అమరావతి: విశాఖలో దాడి జరిగిన వెంటనే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హైద్రాబాద్‌   (పక్క రాష్ట్రం) వెళ్లిపోయారని....పక్క రాష్ట్రానికి వెళ్లి ఎలా విచారణ జరపాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

వైసీపీ వైఎస్ జగన్ ‌పై విశాఖలో దాడి ఘటనపై కలెక్టర్ల కాన్పరెన్స్‌లో గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో  ఘటన జరిగితే  ఎవరిది బాధ్యతని ఆయన ప్రశ్నించారు. ఎయిర్‌పోర్ట్‌ కేంద్రం పరిధిలో ఉంటే  ఆ ఘటనను  రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబునాయుడు  విమర్శించారు.

ఎయిర్‌పోర్ట్ వెలుపల ఘటన జరిగితే ప్రభుత్వ బాధ్యతని, ఎయిర్‌పోర్ట్ లోపల జరిగిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

గాయపడిన వ్యక్తి పొరుగు రాష్ట్రం వెళ్లిపోతే... కనీసం మెడికల్ సర్టిఫికెట్ కూడ లేకుండా ఎలా దర్యాప్తు చేయాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పని చేయకుండా  కేంద్రం అడ్డుకొనే ప్రయత్నం చేస్తోందని  ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో  కేంద్రం కొంత మేరకు సఫలీకృతమైనా... పూర్తి స్థాయిలో  మాత్రం విజయవంతం కాదన్నారు.  విపక్షనేతపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. 

సంబంధిత వార్తలు

జగన్‌ పై దాడి: డీజీపీ వ్యాఖ్యలు దారుణం: అంబటి రాంబాబు

జగన్‌‌‌ను పరామర్శించిన జానారెడ్డి

మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నా: జగన్‌ మీద దాడిపై చంద్రబాబు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

 

click me!