మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కడప కోర్టు చేపట్టనుంది. ఇప్పటివరకు ఈ కేసును పులివెందుల కోర్టు నిర్వహించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. దస్తగిరి అఫ్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను కొందరు బెదిరిస్తున్నారని పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డిపై కూడా ఆయన కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డికి నార్కోటిక్ అనాలిసిస్ పరీక్షలకు అనుమతివ్వాలని సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది కోర్టు.
వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి.. వివేకా హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ గత నెల 21న భరత్ కుమార్ సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు. దీంతో పాటు మీడియా.. ముందుకు వచ్చి కూడా ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు తనకు తెలుసని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే భరత్ కుమార్ ను సీబీఐ అధికారులు విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుతం సీఎం జగన్ కు సొంత బాబాయ్ మాత్రమే కాదు మాజీ మంత్రి అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను కొందరు బలవంతంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వివేకానందరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కడప ఎస్పీ అన్బురాజన్ కు సోమవారం నాడు ఈ మేరకు ఆయన నాలుగు పేజీల ఫిర్యాదును అందించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. నిన్ననే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పులివెందుల కోర్టు శివ శంకర్ రెడ్డిని 14 రోజుల రిమాండ్ విధించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు మరో మలుపు తిరిగింది. సిబిఐ అధికారులు వైసిపి రాష్ట్ర కార్యదర్శి, ఎంపి అవినాష్ రెడ్డి అనుచరుడు శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.