Sidhu Moose Wala murder: ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా(28)ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆదివారం ఆయన ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా..మార్గమధ్యలో ఆయన్ను కాల్చి చంపారు. ఈఘటన వల్ల పంజాబ్లోని అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నైతిక అధికారం కోల్పోయిందనీ.. వెంటనే అధికారం నుంచి వైదొలగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.