యంగ్ స్టార్ నితిన్ తగ్గేది లేదంటున్నారు. ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ తో కామ్ అయిపోయిన నితిన్.. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలను పరుగులు పెట్టిస్తున్నాడు.
కిక్, రేసుగుర్రం లాంటి చిత్రాలకు కథలు అందించిన రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
యంగ్ హీరో నితిన్ గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులని పలకరించాడు. రంగ్ దే, చెక్, మ్యాస్ట్రో చిత్రాలు గత ఏడాది విడుదలయ్యాయి. వీటిలో రంగ్ దే, మ్యాస్ట్రో చిత్రాలు పర్వాలేదనిపించగా.. చెక్ నిరాశ పరిచింది.
ఈ ప్రాజెక్టు కోసం రూ.40 కోట్ల బడ్జెట్ను ఆయన నిర్మాతల ముందుంచారట. దీంతో నితిన్ మార్కెట్, దర్శకుడి క్యాపబిలిటీస్ వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు కోసం రూ.40 కోట్లు భారీ మొత్తం బడ్జెట్ పెట్టడం రిస్క్ అని నిర్మాతలు భావించారని సమాచారం