Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ నేతపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో టీఆర్ఎస్ నేత వెంకన్నపై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం నాడు దాడికి దిగారు.

unknown persons attacked on trs leader ambati venkanna in warangal rural district
Author
Warangal, First Published Sep 18, 2019, 7:15 AM IST

హైదరాబాద్: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో టీఆర్ఎస్ నాయకుడు అంబటి వెంకన్నపై బుధవారం నాడు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బుధవారం నాడు తెల్లవారుజామున తన భార్యతో కలిసి వెంకన్న మార్నింగ్ వాక్ కు వెళ్లాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడికి దిగారు. భూతగాదాలతోనే అతడిపై దాడి జరిగిందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ దాడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వెంకన్న భార్యపై కూడ దుండగులు దాడికి ప్రయత్నించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios