కారులో మంటలు చెలరేగి అలజడిని సృష్టించిన ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. విశాఖలోని గోపాలపట్నం పెట్రోల్ బంక్ కూడలి సమీపంలో కారులో మంటలు చెలరేగాయి.
విశాఖ: కారులో మంటలు చెలరేగి అలజడిని సృష్టించిన ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. విశాఖలోని గోపాలపట్నం పెట్రోల్ బంక్ కూడలి సమీపంలో కారులో మంటలు చెలరేగాయి. ఎయిర్ పోర్ట్ నుండి సింహాచలం వైపు వెళ్తున్న టాటా ఇండిగో కారు కుమారి కళ్యాణ మండపం సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే కారు డ్రైవర్ వెంటనే అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది.
Add Asianetnews Telugu as a Preferred Source

ప్రమాద సమయంలో డ్రైవర్ తో పాటు కారులో నలుగురు ప్యాసింజర్లు వున్నా ఈ ప్రమాదం నుండి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే మంటలు ఎగిసిపడటంతో కారు మాత్రం పూర్తిగా ధ్వంసమయ్యింది.
వీడియో
"
