Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ మెట్రోలో మరో వీడియో వైరల్.. తోటి ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టిన మహిళ.. చుట్టూ ఉన్నవారు ఏం చేశారంటే..

ఢిల్లీ మెట్రోలో ఓ మహిళ తన సహ ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు వేలలో వ్యూస్ వస్తున్నాయి.

Another video viral in Delhi Metro, woman slapped fellow passenger - bsb
Author
First Published Jul 4, 2023, 1:15 PM IST

ఢిల్లీ : ఢిల్లీ మెట్రోలో మరో వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మెట్రో అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రయాణికుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. తాజాగా ఈ సారి తోటి ప్రయాణికుడి చెంప పగలగొట్టింది ఓ మహిళ. ఈ వీడియోలో ఒక మహిళ తన పక్కనే నిలబడి ఉన్న సహ ప్రయాణికుడిపై అరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తరువాత కంపార్ట్‌మెంట్‌లో ఉన్న అందరి ముందు ఆమె అతన్ని చెంపదెబ్బ కొట్టింది. 

ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయగా వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. వీడియోలో, ఒక వ్యక్తి పక్కన నిలబడ్డ మహిళ అతనిపై అరుస్తున్నట్లు చూడొచ్చు. అయితే గొడవకు కారణం స్పష్టంగా తెలియరాలేదు. మహిళ ఆ వ్యక్తిపై అరిచింది. అతనిని చెంపదెబ్బ కొట్టింది. అదే కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ఎవరో వీడియో రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. వారిద్దరూ గొడవపడుతుండగా అక్కడ ఉన్న వారంతా జోక్యం చేసుకోకుండా చోద్యం చూశారు.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో చర్చనీయాంశమైంది. ఎవరైనా ఒక వ్యక్తిని బహిరంగంగా ఎలా కొట్టగలరని ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమందేమో చుట్టూ ఉన్నవాళ్లు ఎందుకు ఆపలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios