Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో అర్థరాత్రి అలజడి... ఓ కుటుంబంపై కర్రలు, కారంతో దాడి

పాతకక్షల నేపథ్యంలో అధికార వైసిపి నాయకుడొకరు తన ప్రత్యర్థిపై దాడికి పాల్పడిన విషాద సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

YSRCP Leader Attacks his enemy in vijayawada
Author
Vijayawada, First Published May 9, 2020, 11:41 AM IST

విజయవాడ: పాతకక్షల నేపధ్యంలో ఓ కుంటుంబంపై ప్రత్యర్థులు గొడ్డుకారం, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటన విజయవాడలోని పాత రాజరాజేశ్వరి పేటలో శుక్రవారం అర్థరాత్రి అలజడి సృష్టించింది. 

ఈ దాడికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ టిడిపి నాయకులు ఖుర్షీద్ కు రాజేశ్వరి నగర్ లో నివాసముండే  సుభానీకి పాతకక్షలు వున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం అర్థరాత్రి ఖుర్షీద్ తన అనుచరులతో కలిసి సుభానీ  ఇంటిపై దాడి  చేశారు. ఇంట్లోవున్న సుభానీని ఇంట్లోంచి బయటకు లాగి కర్రలు, కారంతో దాడిచేశారు. అడ్డువచ్చిన వచ్చిన మహిళలపై కూడా విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డారు. 

ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సుభానీ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ గాయపడిన వారిని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగానే వుంది. 

ఈ దాడిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పాత కక్షలు నేపధ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios