Asianet News TeluguAsianet News Telugu

బెజవాడ హత్య వెనక మహిళ: హంతక ముఠాకు సుపారీ?

విజయవాడలో జరిగిన మహేష్ హత్య వెనక మహిళ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గత అర్థరాత్రి కాల్పుల ఘటనలో మహేష్ అనే యువకుడు మరణించిన విషయం తెలిసిందే.

Woman behind Mahesh murder at Vijayawada
Author
Vijayawada, First Published Oct 11, 2020, 9:09 AM IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జరిగిన మహేష్ హత్య వెనక ఓ మహిళ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. హంతక ముఠాకు సుపారీ ఇచ్చి మహేష్ ను హత్యచేయించినట్లు భావిస్తున్నారు. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగర శివారులో అర్థరాత్రి  కాల్పుల సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. 

మృతుడిని పోలీసు కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహిష్ గా గుర్తించారు. మరో ఇద్దరు పరారయ్యాయురు. విజయవాడ శివారులోని బైపాస్ రోడ్డులో ఉన్న ఓ బార్ సమీపంలో కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. 

మహేష్ మీద పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపారు. మహేష్ మెడ, ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అక్కడికక్కడే అతను కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోగానే అతను మరణించాడు. హరి అనే వ్యక్తి పొట్ట మీది నుంచి ఓ బుల్లెట్ దూసుకుపోయింది. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పథకం ప్రకారమే మహేష్ ను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీపీ బత్తిన శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు నిందితుల కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.  రియల్ ఎస్టేట్ వివాదం ఈ హత్యకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.

పథకం ప్రకారం దుండగులు మహేష్ ను హతమార్చినట్లు అర్థమవుతోంది. తొలుత బార్ వద్దకు వచ్చి చూసి వెళ్లారు. ఆ తర్వాత వచ్చి కాల్పులు జరిపి అతన్ని హతమార్చారు. మిత్రులతో కలిసి మద్యం సేవించడానికి మహేష్ బార్ కు వచ్చాడు. 

దుండగులు నాటు తుపాకి వాడారు. శనివారం అర్థరాత్రి ఆ ఘటన చోటు చేసుకుంది. స్కూటర్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపారు. నిందితుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios