Asianet News TeluguAsianet News Telugu

రోడ్డు ప్రమాదంలో వీడియో జర్నలిస్ట్‌ మృతి

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టూవీలర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీవీ 9 చానెల్‌లో కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్న మురళి అనే వీడియో జర్నలిస్ట్‌ ప్రాణాలు కోల్పోయారు.

video journalist killed in road accident in vijayawada
Author
Vijayawada, First Published Sep 30, 2019, 4:44 PM IST

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టూవీలర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీవీ 9 చానెల్‌లో కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్న మురళి అనే వీడియో జర్నలిస్ట్‌ ప్రాణాలు కోల్పోయారు.

మురళి మృతి పట్ల రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళి కుటుంబానికి పేర్ని నాని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ కూడా మురళి ప్రసాద్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం మురళి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios