Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలుర దొంగల ముఠా... విజయవాడలో వరుస చోరీలు

విజయవాడలో మైనర్ బాలురతో కూడిన దొంగల ముఠా హల్ చల్ చేస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి ఆట కట్టించారు. 

minor boys detained for robbery in vijayawada
Author
Vijayawada, First Published Oct 15, 2019, 2:29 PM IST

విజయవాడ: నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దోపిడీ ముఠా పోలీసులకు చిక్కింది.  అరెస్టయిన నిందితుల నుంచి 426 గ్రాముల బంగారు ఆభరణాలు,18లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు  డిసిపి హర్ష వర్ధన్ రాజు  వెల్లడించారు. 

విజయవాడలో ఇటీవల కాలంలో పగటి పూట ఎక్కువగా చోరీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానాస్పద ముఠాలపై ప్రత్యేక నిఘా వుంచిన పోలీసులు చివరకు దోపిడీకి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. 

minor boys detained for robbery in vijayawada

నగరంలో పలు ప్రాంతాల్లో ఈ ముఠా  ముందుగా రెక్కీ నిర్వహించి  తాళంవేసి వున్న ఇళ్లను చోరీలకు ఎంచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నగర సీపీ ద్వారక తిరుమల రావు ఆదేశాల మేరకు నిఘాని ముమ్మరం చేయడంతో చోరీలకు పాల్పడుతున్న 5 గురు బాలనేరస్థులను అరెస్ట్ చేసామని డిసిపి  తెలిపారు. 

నగరంలో జేబు దొంగతనాలకు పాల్పడుతున్న మరో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు డిసిపి వెల్లడించారు. ఈ నేరస్థులపై గతంలో 8 కేసులు ఉన్నాయని తెలిపారు. ఆర్ధిక సమస్యలు, దురలవాట్ల కోసమే వీరు నేరాల బాట పట్టినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios