Asianet News TeluguAsianet News Telugu

గంజాయి మత్తు... జామెట్రి బాక్స్ లోని పరికరంతో ప్రాణ స్నేహితుడిపై దాడి

గంజాయి మత్తులో విచక్షణను మరిచి తన ప్రాణ స్నేహితుడిని కత్తితో దాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించాడో మైనర్ బాలుడు.

minor boy murder attempt on close friend
Author
Vijayawada, First Published Nov 16, 2020, 7:53 AM IST

విజయవాడ: ప్రమాదకరమైన గంజాయికి బానిసయిన ఓ మైనర్ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆ మత్తులో విచక్షణను మరిచి తన ప్రాణ స్నేహితుడిని కత్తితో దాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన విజయవాడ సమీపంలో చోటుచచేసుకుంది. 

క కృష్ణా జిల్లా రామవరప్పాడు హనుమాన్ నగర్ కాలనీకి చెందిన సురేంద్ర(21)కు 16 ఏళ్ల ఓ బాలుడు స్నేహితులు. గతంలో ఒకే దగ్గర పనిచేయడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. ప్రస్తుతం ఇద్దరూ ఇంటిదగ్గరే ఖాళీగా వుంటూ చెడు వ్యసనాలకు బానిసయ్యారు. 

ఈ క్రమంలోనే ఆదివారం వీరిద్దరు కలిసి మద్యం సేవించడమే కాకుండా గంజాయిని కూడా తాగడంతో మత్తులోకి వెళ్లిపోయారు. ఈ మత్తులో మైనర్ బాలుడికి సురేంద్రకు మద్య చిన్న వివాదం తలెత్తింది. దీంతో  బాలుడు కోపంతో తన వద్దగల జామెట్రి బాక్స్ లోని ఓ పదునైన పరికరంతో సురేంద్ర గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో సురేంద్ర  అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 

రక్తం మడుగులో పడివున్న సురేంద్రను గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే వున్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడిన బాలుడు ప్రస్తుతం పరారీలో వున్నాడని... అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios