Asianet News TeluguAsianet News Telugu

గుండెపోటుతో మరో రాజధాని రైతు మృతి

రాజధాని తరలిపోవడం ఖాయమని భావించి ఆయన కొంతకాలంగా తనలో తానే మదనపడిపోతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గుండె పోటుతో మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు

farmer died due to heart attack in guntur
Author
Hyderabad, First Published Jan 9, 2020, 11:13 AM IST

రాజధాని ప్రాంతం  గుంటూరు జిల్లా తాడికొండ మండలం  పొన్నెకల్ల గ్రామానికి చెందిన రైతు  పాలేటి సుబ్బయ్య(83) బుధవారం  రాత్రి గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన గత 22 రోజులుగా రాజధాని అమరావతికి మద్దతుగా  నిరసనల్లో పాల్గొంటున్నారు. సీఎం జగన్‌ రాజధాని మార్పు ప్రకటన చేసినప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. 

AlsoRead దృష్టి మరల్చడానికే చంద్రబాబు హంగామా... విజయవాడ ఘటన ఆయన స్క్రిప్టే: హోంమంత్రి సుచరిత...

రాజధాని తరలిపోవడం ఖాయమని భావించి ఆయన కొంతకాలంగా తనలో తానే మదనపడిపోతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గుండె పోటుతో మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు.. కాగా... ఇదే కారణంతో ఇప్పటి చాలా మంది రైతులు ప్రాణాలు విడిచారు. ఇదే గ్రామంలో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios