Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో చేసిన దరిద్రం చాలదట... దేశాలను ఏలబోతడట..: కేసీఆర్ పై షర్మిల ధ్వజం

మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైస్సార్ టిపి అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైస్సార్ టిపి అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీఆర్ఎ ల ఆందోళనపై స్పందిస్తూ...  కేసీఆర్ కు అధికార మదం ఉందని వ్యాఖ్యానించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వీఆర్ఎ లు వినతిపత్రం ఇస్తే ఆ పేపర్ ముఖం మీద కొడతారా..? ఇది అధికార మదం కాదా అంటూ మండిపడ్డారు. కేసీఅర్ కి చావు మూడింది... పోయే కాలం మూడిందని అన్నారు. ఇక్కడ చేసిన దరిద్రం చాలదన్నట్లు దేశాలు ఏల బోతడట అంటూ కేసీఆర్ జాతీయపార్టీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. 

కేసీఆర్ అవినీతి గురించి తెలియాలంటే ఒక్క కాళేశ్వరం గురించి తెలిస్తే చాలన్నారు షర్మిల.  కేసీఆర్ ఎడమకాలి కింద తెలంగాణ ఆత్మగౌరవం నలుగుతుంది... కాబట్టి ఆయనను పర్మినెంట్ గా ఫామ్ హౌజ్ కే పరిమితం చేసే రోజులు దగ్గరపడ్డాయని షర్మిల ధ్వజమెత్తారు.