Godhavarikhani:అత్తింటివారి వేధింపులు... కొడుకుతో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం

పెద్దపల్లి: కరోనాతో భర్త చనిపోయి పుట్టెడు దు:ఖంలో వున్న ఆమెకు అత్తింటివారి పోరు ఎక్కువయ్యింది.

First Published Feb 25, 2022, 5:53 PM IST | Last Updated Feb 25, 2022, 5:52 PM IST

పెద్దపల్లి: కరోనాతో భర్త చనిపోయి పుట్టెడు దు:ఖంలో వున్న ఆమెకు అత్తింటివారి పోరు ఎక్కువయ్యింది. దీంతో గోదావరి నదిలో కొడుకుతో కలిసి దూకి ఆత్మహత్యాయత్నం చేయగా చిన్నారి బాలుడు మృతిచెందాడు. మహిళను మాత్రం జాలర్లు కాపాడగలిగారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

కరీంనగర్ సీతరాంపూర్ కు చెందిన దుర్గం లావణ్య భర్త కరోనాతో మృతిచెందాడు. అయితే కొడుకు చనిపోయి బాధలో వున్న కోడలిని ఓదార్చాల్సిన అత్తామామలే వేధింపులకు దిగారు. అత్తామామతో పాటు మరిది, ఆడపడుచుల వేధింపులు భరించలేపోయిన వివాహిత గోదావరిఖని వంతెనపై నుండి కొడుకుతో కలిసి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఆరేళ్ల సద్గుణ్ నీటమునిగి చనిపోగా లావణ్యను జాలర్లు కాపాడారు. ప్రస్తుతం ఆమె గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.