Asianet News TeluguAsianet News Telugu

ఉప్పల్ లో పోలీసులు వర్సెస్ ఆటో డ్రైవర్లు.. షేర్ ఆటోలు సీజ్...

ఉప్పల్ రింగ్ రోడ్ లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 

ఉప్పల్ రింగ్ రోడ్ లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వారంరోజుల నుండి ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని ఉప్పల్ ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్ రావు అన్నారు. నిబంధనలు విరుద్ధంగా ఇద్దరికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకుంటున్న ఆటోలను సీజ్ చేశారు. లాక్ డౌన్ తరువాతే ఈ ఆటోల గురించి ఆలోచించాలని అన్నారు. దీనిమీద ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. షేర్ ఆటోలో కూడా ఇద్దరిని తీసుకువెళ్లమంటే మేము బతకలేం.. మాకు ప్రభుత్వం నెలకు కొంత ఆదాయం ఇవ్వాలని కోరుతున్నారు.