Asianet News TeluguAsianet News Telugu

ఏ బండ్లె పోతావ్ కొడకొ బిజెపి సర్కరోడా... టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోట విప్లవ గీతం

కరీంనగర్: కేంద్రం వరిధాన్యం కొనుగోలుపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చావుడప్పుతో నిరసన చేపట్టింది. ఇందులో భాగంగానే చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ...కేంద్రం యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. ముందస్తుగా తెలంగాణ రాష్ట్రానికి ఎరువులను అందజేయాలని కోరారు. 
ఎరువుల కొరత వస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని కేంద్రాన్ని హెచ్చరించారు. 
 

కరీంనగర్: కేంద్రం వరిధాన్యం కొనుగోలుపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చావుడప్పుతో నిరసన చేపట్టింది. ఇందులో భాగంగానే చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ...కేంద్రం యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. ముందస్తుగా తెలంగాణ రాష్ట్రానికి ఎరువులను అందజేయాలని కోరారు. 
ఎరువుల కొరత వస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని కేంద్రాన్ని హెచ్చరించారు.