Asianet News TeluguAsianet News Telugu

హాజీపూర్‌లో ఉద్రిక్తత: కన్నీరుమున్నీరౌతున్న మృతుల కుటుంబసభ్యులు (వీడియో)

హాజీపూర్‌లో ఉద్రిక్తత: కన్నీరుమున్నీరౌతున్న మృతుల కుటుంబసభ్యులు (వీడియో)

భువనగిరి: హజీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా విద్యార్థినుల మృతదేహాలు బయటపడడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. శ్రావణి మృతి కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మనీషా మృతదేహం సోమవారం లభ్యమైంది. ఈ రెండు హత్యలతో అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు హత్యలు అతనే చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు సంఘటన స్థలాన్ని సీపీ మహేష్ భగవత్, మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు  చేరుకొని బాధితులను ఓదార్చారు.శ్రీనివాస్ రెడ్డి కుటుంబం గ్రామం విడిచి వెళ్లి పోయింది.