Asianet News TeluguAsianet News Telugu

భార్యకు బస్సులో సీటు ఇవ్వలేదని బూతులు తిడుతూ మహిళ ను బస్సు నుంచి కిందకు లాగి పడేసిన ఎస్సై

భార్యకు బస్సులో సీటు ఇవ్వలేదని ఒక ఎస్సై మహిళకు దాడికి పాల్పడ్డ ఘటన కరీంనగర్ లో జరిగింది. సిద్దిపేట నుంచి ఓ మహిళ తన తల్లితో కలిసి మంగళవారం జగిత్యాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు.   

భార్యకు బస్సులో సీటు ఇవ్వలేదని ఒక ఎస్సై మహిళకు దాడికి పాల్పడ్డ ఘటన కరీంనగర్ లో జరిగింది. సిద్దిపేట నుంచి ఓ మహిళ తన తల్లితో కలిసి మంగళవారం జగిత్యాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. అయితే ఆ బస్సు కరీంనగర్ బస్టాండ్ కు చేరుకున్న తరువాత ఎస్సై భార్య ఎక్కారు. దీంతో ఆ బస్సులో సీటు విషయంలో ఎస్ఐ భార్య, సిద్ధిపేట నుంచి ప్రయాణిస్తున్న మరో మహిళ మధ్య వాగ్వాదం జరిగింది.అయితే బస్సు జగిత్యాలకు చేరుకోగానే అనిల్ కుమార్ బస్సు ఎక్కారు. ఆ మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనను ఆమె తన మొబైల్ ఫోన్ తో రికార్డ్ చేస్తుండగా ఎస్ ఐ ఆమె నుంచి ఫోన్ లాక్కుని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో బాధితురాలు జగిత్యాల టౌన్-1 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ, అతడి భార్య కూడా తనను దూషించారని, ఎస్ఐ తనను బస్సు నుంచి బయటకు లాగారని బాధితురాలు తెలిపింది