KCR Birthday:కాలినడకన ఏడుకొండలెక్కి... శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత

తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నిన్న(గురువారం) తిరుమలకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. 

First Published Feb 18, 2022, 3:39 PM IST | Last Updated Feb 18, 2022, 3:39 PM IST

తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నిన్న(గురువారం) తిరుమలకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన ఏడుకొండలపైకి చేరుకున్న కవిత భర్త అనిల్ తో కలిసి ఇవాళ శ్రీవారి నిజపాద సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో కవిత-అనిల్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, స్వామి వారి పట్టు వస్త్రాలను దంపతులకు అందజేశారు.