Asianet News TeluguAsianet News Telugu

ఉచిత విద్యుత్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే...: ఆర్ఎస్ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు

పెద్దపల్లి : వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విషయంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

పెద్దపల్లి : వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విషయంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణలో అధికారం ఎవరిదైనా రైతులకు ఉచిత విద్యుత్ కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్ఫష్టం చేసారు. అధికారంలో వున్న తెలంగాణలోనే రైతులను పట్టించుకోని సీఎం కేసీఆర్ ఈసారి దేశంలో కిసాన్ సర్కార్ తీసుకువస్తాడట అంటూ ఎద్దేవా చేసారు. ముందు తెలంగాణ రైతులక ఇచ్చిన లక్ష రూపాయల రుణమాపీ అమలుచేయాలని ప్రవీణ్ కుమార్ సూచించారు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఆర్ఎస్ ప్రవీణ్ బహుజన రాజ్యాధికారి యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ యాత్ర 250వ రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా దుబ్బపల్లిలో  ప్రవీణ్ కు బిఎస్పీ పెద్దపల్లి ఇంచార్జ్ దాసరి ఉష, ఇతర నాయకులు తదితరులు ఘనస్వాగతం పలికారు. 

Video Top Stories