Asianet News TeluguAsianet News Telugu

సింగరేణిలో బొగ్గుగని ప్రమాదం.. రెండోరోజుకు చేరిన ఆందోళనలు..

పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని ఓసీపీ-1లో జరిగిన బ్లాస్టింగ్ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ రెండో రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.

పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని ఓసీపీ-1లో జరిగిన బ్లాస్టింగ్ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ రెండో రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఓసీపీలో పనులు చేసేందుకు కార్మికులు నిరాకరించారు. పనులు చేసేందుకు యాజమాన్యం సమాయత్తం అవుతుండగా కార్మిక సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో ఓసీపీ-1లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బ్లాస్టింగ్ ఘటన తరువాత కాంట్రాక్టు మహాలక్ష్మీ ఓబీ కాంట్రాక్టు సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం కార్మికులను ఆందోళన కల్గిస్తోంది. సింగరేణి డైరక్టర్ చంద్ర శేఖర్ గోదావరిఖనికి చేరుకుని బాధిత కుటుంబాలకు యాజమన్యం తరుపున న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా స్పష్టత లేదంటూ బాధిత కుటుంబాలు ఆందోళన చెస్తున్నాయి. దీంతో బుధవారం కూడా గోదావరిఖని ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళనలు కొనసాగతున్నాయి.