కరీంనగర్ లో అర్థరాత్రి భారీ చోరీ...
కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ ముందుగల కోపరేటివ్ సొసైటీ సేవ బ్యాంకులో 34 లక్షల నగదు చోరీకి గురైంది.
కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ ముందుగల కోపరేటివ్ సొసైటీ సేవ బ్యాంకులో 34 లక్షల నగదు చోరీకి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ ముందు గల మసీద్ కాంప్లెక్స్ లోని ముస్లిం కోపరేటివ్ సొసైటీలో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో దొంగలు చొరబడి ముప్పై నాలుగు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారని అధికారులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.