Asianet News TeluguAsianet News Telugu

తల్లి కావాలనే పద్నాలుగేళ్ల కల నెరవేరేలోపే.. మృత్యువు కాటేసింది..

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేగొండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేగొండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జూపాక కనుకయ్య స్వరూపలకు పెళ్లై పద్నాలుగు సంవత్సరాలైన సంతానం లేదు. దీంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో IVF ద్వారా గర్భం దాల్చింది. కవలపిల్లలని చెప్పడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అయితే ఎనిమిదో నెలలో హఠాత్తుగా వచ్చిన గుండెపోటు స్వరూపతో పాటు, కడుపులోని ఇద్దరు పిల్లల్నీ బలి తీసుకుంది. దీంతో ఇరుకుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి.