Asianet News TeluguAsianet News Telugu

ఖమ్మం సభకు మించి పాలమూరు సభ... భట్టితో పొంగులేటి, జూపల్లి భేటీ

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ నెలాఖరు నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసల ఫ్లో మొదలవుతుందని చెప్పారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో భట్టి విక్రమార్కతో సమావేశం అయ్యారు. అనంతరం జూపల్లిసైతం భేటీ అయ్యారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరులో కాంగ్రెస్ సభ.. ఖమ్మం సభను మరిపించేలా ఉంటుందని అన్నారు. ప్రజల ఏం  కోరుకుంటున్నారో.. దానిని నెరవేర్చడమే తమ అజెండా అని అన్నారు.