Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ బర్త్ డే నాడు జోరుగా పార్టీ ఇచ్చిన కౌన్సిలర్.. కరోనా పాజిటివ్ గా నిర్థారణ..

సిరిసిల్ల మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పాటు, కౌన్సిలర్లను కరోనా భయం వెంటాడుతోంది. 

సిరిసిల్ల మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పాటు, కౌన్సిలర్లను కరోనా భయం వెంటాడుతోంది. గత 24న జరిగిన కేటిఆర్ జన్మదిన వేడుకలను ఓ కౌన్సిలర్ కేక్ కట్ చేసి జరిపాడు. అనంతరం పెద్ద ఎత్తున పార్టీ కూడా ఇచ్చాడు. ఈ పార్టీకి సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు హాజరయ్యారు. అయితే తాజాగా, దావత్ ఇచ్చిన ఆ కౌన్సిలరుకు కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఈ పార్టీకి హాజరైనా నాయకుల్లో గుబులు మొదలయ్యింది. అతనితో సన్నిహితంగా ఉన్నవారిని హోం క్వారంటైన్ కావాల్సిందిగా వైద్యులు తెలిపారు. ఇప్పటికే చాలామంది స్వచ్ఛందంగా హోం క్వారంటైన్ అయ్యారు.