Asianet News TeluguAsianet News Telugu

తిట్టిందని.. కర్రలతో దాడి చేసిన బంధువులు.. తట్టుకోలేక చనిపోయిన వృద్ధురాలు..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇందిరానగర్ లో దారుణం జరిగింది.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇందిరానగర్ లో దారుణం జరిగింది. ఓ వయసుమళ్లిన మహిళను సొంత అన్న కూతురు, కోడలు కర్రలతో కొట్టడంతో చనిపోయింది. కుటుంబాల మధ్య గొడవలు ఉండడం ఒక కారణమైతే, పెద్దామె తాగితే నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం ఒక కారణం. అలా ఆ రోజు కూడా నోటికొచ్చినట్టు తిట్టడంతో అన్నకూతురు, కోడలు కలిసి కర్రలతో దాడిచేసి తీవ్రంగా కొట్టారని, ఆ తరువాత ఇంటికొచ్చి పడుకున్న ఆమె చనిపోయిందని దగ్గరి బంధువులు చెబుతున్నారు.