అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం : మంత్రి గంగుల కమలాకర్
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోని రాం నగర్ చౌరస్తాలో 15, 16, 37, 38వార్డుల తెరసా అభ్యర్థులతో మంత్రి గంగుల కమలాకర్ రోడ్ షో నిర్వహించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోని రాం నగర్ చౌరస్తాలో 15, 16, 37, 38వార్డుల తెరసా అభ్యర్థులతో మంత్రి గంగుల కమలాకర్ రోడ్ షో నిర్వహించారు. ఆయా డివిజన్ లలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ అధికార తెరసా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెరాసా కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని సూచించారు.