Asianet News TeluguAsianet News Telugu

వలస కూలీలకు సొంత ఖర్చులతో రవాణా ఏర్పాట్లు .. వీడ్కోలు చెప్పిన సత్యవతి రాథోడ్

గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ లో పలు ప్రాంతాల్లో, గ్రామాల్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ లో పలు ప్రాంతాల్లో, గ్రామాల్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వలస కూలీలకు సొంతఖర్చులతో రవాణా ఏర్పాట్లు చేసి వీడ్కోలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ...వలస కూలీలను తరలించడంలో కేంద్రం ఒక రోడ్ మ్యాప్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసిందన్నారు. ప్రైవేట్ బస్సులు పెట్టి, సొంతంగా డీజిల్ పోయించి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.