Asianet News TeluguAsianet News Telugu

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు (వీడియో)

నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం బాచే పల్లి గ్రామంలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఈ స్కీమ్ ను ప్రారంభించినట్టు తెలిపారు.

నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం బాచే పల్లి గ్రామంలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఈ స్కీమ్ ను ప్రారంభించినట్టు తెలిపారు.
 
బాచే పల్లి తండా ను భక్తి దామ తండా గా పెరు మార్చాలని గ్రామస్తులు కోరారు.  వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మంత్రి హరీష్ రావు కలెక్టర్ ను ఆదేశించారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం తండాలని గ్రామ పంచాయతీ లు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని హరీష్ రావు విమర్శించారు. తమ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన తర్వాత తండాలను గ్రామపంచాయితీలుగా మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.