Asianet News TeluguAsianet News Telugu

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం.. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం..

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర్ మండలం రెవెన్యూ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. 

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర్ మండలం రెవెన్యూ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన గంట సతీష్ తనకు చెందిన 30 గుంటల స్థలం పట్టదారు  వేరేవారి పేరిట మారిందని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అసహనానికి గురై పెట్రోల్ బాటిల్ తో వాటర్ ట్యాంక్ ఎక్కాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మార్వో సునిత ఘటనా స్థలానికి చేరుకుని బాధితునితో ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తానని హమీ ఇవ్వడంతో కిందకు దిగాడు. రెండేళ్లుగా అధికారులు తనను ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారే తప్ప పట్టాదారు పేరును మాత్రం మార్చడం లేదని సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Video Top Stories