Asianet News TeluguAsianet News Telugu

తాటి చెట్టుపై మూడు గంటలు.. యువకుడి హంగామా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు మూడు గంటల పాటు తాటి చెట్టుపై హంగామా చేశాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు మూడు గంటల పాటు తాటి చెట్టుపై హంగామా చేశాడు. తంగళ్లపల్లి మండలం సారంపెల్లి గ్రామానికి చెందిన గోనెపెల్లి కిషన్ గౌడ్ తాటి చెట్టు ఎక్కి మూడు గంటల పాటు స్థానిక ప్రజలను నానా హంగామా చేశాడు.  ఉదయం తాటి చెట్టు ఎక్కిన కిషన్ గౌడ్ మధ్యాహ్నం 2 గంటలైనా దిగకపోవడంతో గమనించిన స్థానికులు విషయం ఏంటని అడిగితే చెట్టుమీది నుండి దూకి చచ్చిపోతానని సమాధానం ఇచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు, పోలీసుల ప్రయత్నంతో చివరికి కిందికి దిగాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో వివరాలు తెలియలేదు.