Asianet News TeluguAsianet News Telugu

పండించిన పంటకు రైతులే ధర నిర్ణయించే రోజు రావాలి.. జగదీష్ రెడ్డి

నియంత్రిత సాగు పై రైతుల్లో అవగాహన కల్పించేందుకు గాను గురువారం మధ్యాహ్నం సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలం అనిరెడ్డిగూడెం లో రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.

నియంత్రిత సాగు పై రైతుల్లో అవగాహన కల్పించేందుకు గాను గురువారం మధ్యాహ్నం సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలం అనిరెడ్డిగూడెం లో రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామం నడిబొడ్డున ఉన్న రచ్చబండ పై జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న రైతులు తమ తమ అనుమానాలను మంత్రి జగదీష్ రెడ్డి ని అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈసందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ధరను నిర్ణయించే అధికారం రావాలనే యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయోగాత్మకంగా అమలు పరుస్తున్నారన్నారు. అందుకు అనుగుణంగా రైతులు పంటల మర్పిడిపై దృష్టి సారించాలని ఆయన రైతులకు ఉద్బోధించారు.