Asianet News TeluguAsianet News Telugu

మోదీ సర్కార్ పై హైదరబాదీ ముస్లిం వ్యాపారి ప్రశంసలు...

కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు ముద్రా యోజన ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా లబ్దిపొందిన హైదరాబాద్ వ్యాపారి అసన్ ఉల్ హల్ ఇటీవలే కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. 

కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు ముద్రా యోజన ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా లబ్దిపొందిన హైదరాబాద్ వ్యాపారి అసన్ ఉల్ హల్ ఇటీవలే కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 'పితాంబరి' సబ్బుల తయారీ వ్యాపారం ప్రారంభించానని... ప్రస్తుతం బిజినెస్ సక్సెస్ ఫుల్ గా సాగుతోందని అసన్ తెలిపాడు. ప్రస్తుతం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంవద్ద, హైదరాబాద్ లోని చినజీయర్ ఆలయం, మహంకాళి ఆలయాల వద్ద ఈ సబ్బులు అమ్ముతున్నట్లు వ్యాపారి తెలిపాడు. తానిలా కుటుంబంతో ఆనందంగా వుండటానికి ప్రధాని మోదీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే కారణమంటూ హసన్ కృతజ్ఞతలు తెలిపాడు.