Asianet News TeluguAsianet News Telugu

13 మందికి టోకరా పెట్టిన నిత్య పెళ్లికూతురు... ఈ మాయ లేడీ లెవెలే వేరు..!

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ నిత్య పెళ్లి కూతురు బండారం బయటపడింది. 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ నిత్య పెళ్లి కూతురు బండారం బయటపడింది. ఆమె ఒకటి కాదు, రెండు కాదు.. 13 మందికి టోకరా ఇచ్చి నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది. నాలుగో భర్తతో తొలుత వైవాహిక జీవితం సాగిన.. నిత్యం భర్తను వేధింపులకు గురి చేస్తూ.. అతడ్ని మానసికంగా చిత్రహింసలకు గురిచేసింది. అంతటితో ఆగకుండా.. అత్తగారి ఇంటి నుంచి బంగారం, నగదుతో పరార్ అయ్యింది. కొన్ని రోజుల తరువాత భర్తకు ఫోన్ చేసి.. హైదరాబాద్ కు రప్పించి.. స్నేహితులతో గదిలో బంధించి కొట్టించింది. పదిలక్షలు ఇవ్వకుంటే.. భర్త పర్సనల్ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరింపులకు పాల్పడింది. భార్యను తనకు ప్రాణభయం ఉందని... తనకు న్యాయం చేయాలంటూ సదరు భర్త  పోలీసులను ఆశ్రయించారు.