Asianet News TeluguAsianet News Telugu

నిండుకుండలా పార్వతీ బ్యారేజ్... 74 గేట్లెత్తడంతో ఆహ్లాదకరంగా నీటి పరవళ్లు

పెద్దపల్లి : కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్ నిండుకుండలా మారింది. 

పెద్దపల్లి : కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్ నిండుకుండలా మారింది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఎగువన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి పార్వతి బ్యారేజ్ కు 40వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం 128.87 అడుగులకు చేరడంతో పార్వతి బ్యారేజ్ 74 గేట్లను ఎత్తి వచ్చిననీటిన వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.