Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ జిల్లాలో విషాదం... బావిలోపడి హాస్టల్ విద్యార్థి మృతి

కరీంనగర్ : ఆదివారం సెలవురోజు కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు

కరీంనగర్ : ఆదివారం సెలవురోజు కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ లోని ఎల్ఎండి కాలనీలో గల సెయింట్ ఆంథోనీ హైస్కూల్లో చదువుతున్న బాలుడు హాస్టల్లో వుండేవాడు. నిన్న తోటి హాస్టల్ విద్యార్థులతో కలిసి ఆడుకుంటుండగా  బాలుడు బావిలో పడ్డాడు. ఇది గమనించిన మిగతా విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచరమిచ్చారు. వారు బావివద్దకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. బావిలో పడిన వెంటనే బాలుడు మృతిచెందగా మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటనే తమ బిడ్డ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాలుడి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.