వర్థన్నపేటకు దేవాదుల నీళ్లు.. సాగునీరు విడుదల చేసిన ఎర్రబెల్లి..
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాలువల ద్వారా సాగునీటిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విడుదల చేశారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాలువల ద్వారా సాగునీటిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విడుదల చేశారు. ఈ కాలువల ద్వారా వర్దన్నపేట నియోజకవర్గంలోని.. వర్దన్నపేట మండలం చెన్నారం గ్రామాలకు సాగు నీరు అందుతాయి. కాళేశ్వరం, ఎస్సారెస్సీ, ఇప్పుడు దేవాదుల నీరు ఇక్కడి ప్రజలకు అందడం ఆనందదాయకం అని మంత్రి అన్నారు. చెన్నారం, బొల్లికుంట చెరువులు నిండి ఈ ప్రాంతం సస్యశ్యామలం కానున్నదని మంత్రి తెలిపారు.