Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ వాసులకు శుభవార్త.. ప్రతిరోజూ మంచినీటి సరఫరా.. గంగుల కమలాకర్

కరీంనగర్ వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. తలాపునే మానెరు ఉన్నా కూడా నీటి కోసం ఎదురు చూసిన పరిస్థితి ఉండే కరీంనగర్ లో నీటి కష్టాలు తీరబోతన్నాయి. 

కరీంనగర్ వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. తలాపునే మానెరు ఉన్నా కూడా నీటి కోసం ఎదురు చూసిన పరిస్థితి ఉండే కరీంనగర్ లో నీటి కష్టాలు తీరబోతన్నాయి. అర్బన్ మిషన్ భగీరథ ద్వారా నిత్యం తాగునీరు అందించేందుకు ఉద్దేశించబడిన పథకం ద్వారా.. మంగళవారంనుండి ప్రతి రోజూ నీరు అందిస్తాంమని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. వారం రోజుల ట్రయల్ రన్ లో ఇబ్బందులు పరిష్కరించుకుని ముందుకు వెళ్తాం అని, తెలంగాణా రాష్ట్రంలో నిత్యం తాగు నీరు అందించే తొలి కార్పొరేషన్ కరీంనగర్ అని అన్నారు. ఈ పథకాన్ని త్వరలోనే మంత్రి ktr చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు.