హిజాబ్ కేసు విచారణలో శబరిమల తీర్పు ప్రస్తావన... చిలుకూరు బాలాజీ అర్చకుల అభ్యంతరం
కర్ణాటకలో హిజాబ్ కేసు విచారణలో పదేపదే శబరిమల తీర్పును ప్రస్తావించడంపై చిలుకూరు దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
కర్ణాటకలో హిజాబ్ కేసు విచారణలో పదేపదే శబరిమల తీర్పును ప్రస్తావించడంపై చిలుకూరు దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. శబరీ మల దేవస్థానం విషయంలో ఇచ్చిన తీర్పు రివ్యూ లో ఉందని, అదే విషయమై చిలుకూరు బాలాజీ మూలావిరాటు దేవుళ్ళకు ప్రాథమిక హక్కులపై రాష్ట్రపతికి కూడా విన్నవించడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేసారు. పదే పదే ఈ జడ్జిమెంట్ ను కోట్ చేయొద్దని, జ్యూడిషియల్ మొరాలిటీ ప్రదర్శించాలని ఆయన విజ్ఞప్తి చేసారు..!