Asianet News TeluguAsianet News Telugu

పుట్టా మధు నుండి ప్రాణహాని... కన్నీరు పెట్టుకున్న మహిళా ఎంపిపి దంపతులు

పెద్దపల్లి  బిఆర్ఎస్ పార్టీకే చెందిన జిల్లాపరిషత్ చైర్ పర్సన్ పుట్టా మధు నుండి ప్రాణహాని వుందంటూ సొంత పార్టీ ఎంపిపి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.పెద్దపల్లి జిల్లా రామగిరి ఎంపిపి దేవక్క, భర్త కొమురయ్యతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. 
 

పెద్దపల్లి  బిఆర్ఎస్ పార్టీకే చెందిన జిల్లాపరిషత్ చైర్ పర్సన్ పుట్టా మధు నుండి ప్రాణహాని వుందంటూ సొంత పార్టీ ఎంపిపి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.పెద్దపల్లి జిల్లా రామగిరి ఎంపిపి దేవక్క, భర్త కొమురయ్యతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పుట్టా మధు నుండి కాపాడాలంటూ ఎంపిపి దేవక్క కన్నీటిపర్యంతం అయ్యారు.మాట్లాడదామని పిలిచి తన భార్య ముందే పుట్టా మధు దుర్భాషలాడాడని కొమురయ్య అన్నాడు. గతంలో లాయర్ దంపతులకు పట్టిన గతే మీకు పడుతుందని బెదిరించాడని బాధిత దంపతులు ఆందోళన వ్యక్తం చేసారు. 

పుట్టా మధు బెదిరింపులపై రామగుండం సిపికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపిపి దంపతులు తెలిపారు. అలాగే ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుని వెళతామని అన్నారు. పుట్టా మధు నుండి తమను కాపాడాలని ఎంపిపి దేవక్క కోరారు.