Asianet News TeluguAsianet News Telugu

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో బోనాల సందడి... పట్టువస్త్రాలు సమర్పించిన తలసాని

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా హైదరాబాదీలు ఆషాడ మాసంలో జరుపుకునే పండగ బోనాలు.

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా హైదరాబాదీలు ఆషాడ మాసంలో జరుపుకునే పండగ బోనాలు. ఈ క్రమంలో గత ఆదివారం సికింద్రాబాద్ బోనాలు అట్టహాసంగా ముగియగా ఈరోజు హైదరాబాద్ మొత్తం బోనాల పండగ జరుపుకుంటున్నారు. మహిళలు అందంగా ముస్తాబుచేసిన బోనాలను తలపై ఎత్తుకుని డప్పుచప్పుళ్లు, పోతురాజులు, శివసత్తుల నృత్యాలతో అమ్మవారి ఆలయానికి వెళ్ళి బోనం సమర్పిస్తున్నారు. ఇలా పాతబస్తి చార్మినార్  భాగ్యలక్ష్మి అమ్మవారికి కూడా మహిళలు బోనాలు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 

ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో వున్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా బోనమెత్తారు. ఆస్ట్రేలియాలో వుంటున్న తెలంగాణ మహిళలతో కలిసి కవిత బోనం ఎత్తుకున్నారు.