Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ... ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర, రాష్ట్ర బిజెపి నాయకులు

హైదరాబాద్: దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశాలు తెలంగాణలో వున్నట్లు భావిస్తున్న ఆ పార్టీ అదిష్టానం ఇటీవల ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటోంది. 

హైదరాబాద్: దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశాలు తెలంగాణలో వున్నట్లు భావిస్తున్న ఆ పార్టీ అదిష్టానం ఇటీవల ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇరవైఏళ్ల తర్వాత మరోసారి తెలంగాణ రాజధాని హైదరాబాద్ బిజెపి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడానికి సిద్దమయ్యింది. ఈ సమావేశాల కోసం విచ్చేసే ప్రధాని మోదీతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగసభను కూడా ఏర్పాటుచేసింది. ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ బిజెపి సిద్దమయ్యింది. ఈ క్రమంలోనే ప్రధాని సభకోసం జరుగుతున్న ఏర్పాట్లను బిజెపి జాతీయ నేతలు శివ ప్రకాష్, అరవింద్ మీనన్ తో కలిసి తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్, జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు పరిశీలించారు.