Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఆస్ట్రేలియా ‌- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఛైర్ పర్సన్...

హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది.

హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖలతో పాటు సామాన్యులు సైతం ఈ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడమే కాకుండా ఇతరులు కూడా మొక్కలు నాటేలా సవాల్ చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ నేషనల్ చైర్ పర్సన్ జోడి మెకే కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జిహెచ్ఎంసి పార్కులో  జోడి మొకే మెక్కలు నాటారు. ఈ సందర్భంగా తాను నాటిన మొక్కతో సెల్పీ దిగారు. ఆమెను గ్రీన్  ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ 'వృక్ష వేదం' పుస్తకాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం ఎన్నారై అధ్యక్షుడు నాగేందర్ పాల్గొన్నారు. 
 

Video Top Stories