Asianet News TeluguAsianet News Telugu

పట్టణ ప్రగతి పనుల్లో విషాదం: గోడ కూలి చిన్నారి మృతి, పరామర్శించిన ఎర్రబెల్లి

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ 43వ డివిజన్, హన్మకొండ- కొత్తూరు జెండా ప్రాంతంలో ప్రాక్లెయిన్‌తో చదను చేస్తుండగా గోడ కూలింది. 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ 43వ డివిజన్, హన్మకొండ- కొత్తూరు జెండా ప్రాంతంలో ప్రాక్లెయిన్‌తో చదను చేస్తుండగా గోడ కూలింది. ఈ ప్రమాదంలో ప్రిన్సీ అనే బాలిక మరణించగా, ఆమె తమ్ముడు గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడిన ఎర్రబెల్లి .. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అక్కడికక్కడే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఆయనకు వివరాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆ బాలిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గాయపడిన బాలుడికి వెంటనే మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలని డాక్టర్లు, అధికారులను ఆదేశించారు. అనంతరం అంబులెన్స్ లో ఉన్న బాలిక మృత దేహాన్ని చూసి ఎర్రబెల్లి చలించిపోయారు. మృత దేహానికి త్వరితగతిన పోస్టు మార్టం జరిగే విధంగా చూడాలని స్థానిక ఎంజీఎం వైద్యశాల సూపరింటెండెంట్‌ని మంత్రి ఆదేశించారు.     

Video Top Stories