Asianet News TeluguAsianet News Telugu

భర్త మృతదేహం కోసం నెలరోజులుగా ఓ భార్య ఎదురుచూపులు

పొట్టకూటికోసం సౌదీఅరేబియా వెళ్లిన అమీన్ పీర్ అక్కడే నెలరోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. భర్త చనిపోయాడని తెలిసి అతని మృతదేహం కోసం..కడసారి చూపుకోసం అతని భార్య హలీమా నెలరోజులుగా ఎదురుచూస్తుంది. 

పొట్టకూటికోసం సౌదీఅరేబియా వెళ్లిన అమీన్ పీర్ అక్కడే నెలరోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. భర్త చనిపోయాడని తెలిసి అతని మృతదేహం కోసం..కడసారి చూపుకోసం అతని భార్య హలీమా నెలరోజులుగా ఎదురుచూస్తుంది.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం కొటాలకు చెందిన అమీన్ పీర్ (47)కుటుంబ పోషణ నిమిత్తం అప్పులు చేసి సౌదీఅరేబియా వెళ్ళాడు. అల్ఖాసీం రాష్ట్రంలో ఓ సేట్ వద్ద పనికి కుదిరాడు. రెండు నెలల క్రితం అమీన్ పీర్ భార్య హాలీమాతో ఫోన్లో మాట్లాడుతూ తనకు సేట్ ఆరు నెలల జీతం ఇవ్వాలని ఇచ్చిన వెంటనే డబ్బు ఇంటికి పంపుతానని చెప్పాడట. అయితే ఆగస్టులో అమిన్ పీర్ గుండెపోటుతో మృతిచెందాడు. ఆ సమాచారాన్ని ఆలస్యంగా మృతుడి కుడుంబానికి తెలిపారు. పని చేసిన కాలానికి జీతం ఇవ్వడం లేదని, మృతదేహాన్ని ఇండియా కు పంపడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వీరికి ఏడు సంవత్సరాల వయసుగల కవల పిల్లలు ఉన్నారు. కూలీకి వెళ్తే గానీ పూట గడవని పరిస్థితి వీరిది. ఇప్పుడు ఆ పెద్ద దిక్కు కూడా పోవడంతో ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.