Asianet News TeluguAsianet News Telugu

అయోధ్యలో రాముడి నుదుటి పై సూర్యకిరణాలు

అయోధ్య ఆలయంతో ప్రతిష్టించే రామయ్య విగ్రహానికి సబంధించిన వివరాలను తాజాగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వెల్లడించారు.

అయోధ్య గర్భాలయంలోని రామయ్య విగ్రహ ఎత్తు విషయంలో అంతరిక్ష పరిశోధనలు జరిపే శాస్త్రవేత్తల సలహాలు తీసుకున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. కాబట్టి ప్రతి సంవత్సరం తెలుగు నెలల ప్రకారం చైత్ర మాసం శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజు రామనవమి వస్తుంది... ఈ రోజున సూర్యుడి కిరణాలు రామయ్య విగ్రహంపై పడేలా ఏర్పాట్లు చేసామన్నారు. రామనవమి రోజు మధ్యాహ్నం నేరుగా సూర్యకిరణాలు స్వామివారి విగ్రహంపై పడతాయని ... ఆ సమయంలో రామయ్య దేధీప్యమానంగా వెలిగిపోనున్నారని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.